Naveen Polishetty: అభిమానికి బిర్యానీ తినిపించిన హీరో నవీన్ పోలిశెట్టి
Naveen Polishetty: అభిమాన హీరోతో ఒక్క ఫొటో దిగినా సంబరమే. అటువంటిది హీరో చేత్తోనే బిర్యానీ తింటే..! ఆనందానికి హద్దుంటుందా..? విజయవాడ (Vijayawada) లో ఇటువంటి సంఘటనే జరిగింది. యువ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తన కొత్త సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటివల రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో విజయవాడ చేరుకున్న ఆయన అక్కడ ఫేమస్ అయిన ఈట్ స్ట్రీట్ కు వెళ్లారు. అక్కడ ఓపెన్ టాప్ కారులో అభిమానుల మధ్య బిర్యానీ తిన్నారు.
అయితే.. అక్కడ ఓ అభిమానికి బిర్యానీ తినిపించారు. అనంతరం బిర్యానీ కుండను ఆయనకే ఇచ్చేశారు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘విజయవాడ టూర్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఫుడ్ స్ట్రీట్ కి వెళ్లి తింటే ఇంత బాగుంటుందా..? బెజవాడ అంటారు బాబూ దీనినే. అభిమానులతో కలిసి తింటే మజానే. థ్యాంక్యూ విజయవాడ’ అని రాసుకొచ్చారు. సెప్టెంబర్ 7న విడుదలకానున్న తన కొత్త సినిమాను ఆదరించాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
This tour has been unbelievable. Vijayawada lo food street ki velli tinte Ila untunda ❤️ Bejawada antaru babu 🔥One of my fav moments of the trip so far. Eating with you guys. Thank you Vijayawada for this love ❤️#MissShettyMrPolishetty ni full ga enjoy cheyandi on Sep 7th :)… pic.twitter.com/RPqg0uHwzz
— Naveen Polishetty (@NaveenPolishety) August 27, 2023