వైఎస్ జగన్ ముందస్తు ముచ్చట.! మళ్ళీనా.?
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
అదిగదిగో ముందస్తు ఎన్నికలు.. ఇదిగిదుగో వైఎస్ జగన్ ఢిల్లీకి పయనం.! గత కొన్నాళ్ళుగా నడుస్తోన్న హైడ్రామాలో.. ఇంకోసారి ఈ మాట వినిపిస్తోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. అది కూడా ముందస్తు ఎన్నికల విషయమై ‘పెద్దలతో’ చర్చించడం కోసమట.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే, ఆ పార్టీలో ‘పెద్ద’ ఎవరుంటారు.? ఛాన్సే లేదు. పైగా, ఢిల్లీలో ఆయనకు ‘పెద్దలు’ ఎవరున్నారు.? ఢిల్లీకి వెళ్ళి, ఎవరితో ముందస్తు ఎన్నికలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తారు.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్ని, ఢిల్లీలో వున్న బీజేపీ అధినాయకత్వం తాలూకు పెద్దలు ఆడిస్తున్నారన్నది నిర్వివాదాంశం. బీజేపీకి జనసేన మిత్రపక్షం గనుక.. అది వేరే వ్యవహారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని విమర్శించరు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంగతి సరే సరి.
మిత్రపక్షం జనసేనకు బీజేపీ గౌరవం ఇవ్వడం అనేది మళ్ళీ ఇంకో చర్చ. బీజేపీ పెద్దల ముందు చంద్రబాబు ఎందుకు సాగిలపడతారో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు సాగిల పడతారో ఎవరికీ అర్థం కాదాయె.!
ఇంతకీ, వైఎస్ జగన్ ఎందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు.? ముందస్తు ఎన్నికలకు సంబంధించి, ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆయనేమన్న ఆశీర్వాదం పొందబోతున్నారా.? ఈ విషయమై మీడియాకి ఆషామాషీగా ఏమీ లీకులు అందడంలేదు. తెరవెనుకాల పెద్ద కథే నడుస్తోంది.
వైసీపీ నుంచే మీడియాకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై లీకులు అందుతాయ్. ముందస్తు ఎన్నికల పుకార్లకు సంబంధించి కూడా అదే పరిస్థితి. ఇదంతా ఓ ప్రసహనం అంతే.!