విశాఖ మారింది.! జనసేన వైపు చూస్తోంది.!
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖలో వారాహి విజయ యాత్ర చేస్తున్నారు. నటనలో ఓనమాలు నేర్చుకున్న విశాఖ గురించీ, ఆ విశాఖ ఇచ్చిన ధైర్యం గురించీ, విశాఖలో వారాహి విజయ యాత్ర సందర్భంగా తొలి రోజు నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
వైసీపీ హయాంలో విశాఖ ఎలా దోపిడీకి గురవుతోందన్న విషయాన్ని ప్రజలకు మరింత ఎఫెక్టివ్గా పవన్ కళ్యాణ్ చెప్పగలిగారు. ఆ దోపిడీని ప్రపంచానికి చూపించేలా, నిన్న రుషికొండకి వెళ్ళారు పవన్ కళ్యాణ్.
ఆ రోడ్డులో ఎవరు వెళ్ళినా, ‘ఇంత దారుణంగా కొండని నాశనం చేస్తున్నారేంటి.?’ అనిపించకమానదు. పవన్ కళ్యాణ్, రుషికొండకి వెళ్ళడంతో, ఈ విషయాన్ని స్టేట్ మీడియాతోపాటు, నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది.
రుషి కొండని తవ్వేసి, గ్రీన్ మ్యాట్స్ (జియో మ్యాట్స్)తో తవ్వకాల బాగోతం బయటపడకుండా కప్పేసిన వైనం రాష్ట్ర ప్రజలకీ, దేశ ప్రజలకీ అర్థమయ్యింది. తుపాన్ల నుంచి విశాఖకు రక్షణ గోడగా నిలుస్తున్న కొండల్ని తవ్వుకుంటూ పోతే, విశాఖ భవిష్యత్తు ఏమయిపోతుందనే ఆవేదన జనసేనాని వ్యక్తం చేశారు.
నిజానికి, ఇది జనం ఆవేదన. ఆ వేదన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట మరింత గట్టిగా వినిపించిందంతే. దారిపొడుగునా, పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనను అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి.
ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ అటు వైపు వెళ్ళకూడదన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యూహ రచన చేసినా, జనసేనాని తన ప్రయాణం ఆపలేదు. మార్గమధ్యంలో పోలీసు అధికారులు సైతం, పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేశారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఔను, మారింది.! విశాఖ చాలా చాలా మారింది.! జనసేన వైపు చూస్తోంది.!