డబ్బులివ్వడానికి వెళ్లి.. వృద్దురాలిని హతమార్చిన వాలంటీర్
విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సుజాతనగర్లో ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్ హత్య చేయడం సంచలనం సృష్టించింది. 95వ వార్డు పురుషోత్తపురంలో వెంకటేష్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. హత్యకు గురైన వృద్ధురాలు కొంతకాలంగా వరలక్ష్మి నిర్వహిస్తున్న దుకాణంలో పార్ట్టైమ్గా పనిచేస్తోంది. రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని వెంకటేష్ హత్య చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు, క్లూస్ టీం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాలంటీర్ వెంకటేష్ ముఖంపై దిండుతో అదిమి చంపినట్లు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. నిందితులు వృద్ధురాలిని హత్య చేసి ఆమె స్టూల్పై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాత్రి వృద్ధురాలు ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు విశాఖ బీచ్ రోడ్డులోని రుషికొండ సమీపంలో అలల తాకిడికి పర్యాటక బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సందర్శకులతో బీచ్ విహారయాత్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీచ్కు 150 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బోటులో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. స్పీడ్ బోట్ కారణంగానే ప్రమాదం జరిగిందని, అదే సమయంలో అల ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెబుతున్నారు. పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించడంతో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ఒడ్డున ఉన్నవారు గమనించడంతో రుషికొండ మెరైన్ పోలీసులు, మత్స్యకారులు, లైఫ్ గార్డులు మరో బోటులో వెంటనే సముద్రంలోకి వెళ్లి పర్యాటకులను రక్షించారు. ప్రమాదానికి గురైన పడవను తాళ్లతో ఒడ్డుకు చేర్చారు.
TAGGED :